Monday, April 29, 2024

HYD:యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద.. గౌతంరావు

కాచిగూడ, జనవరి 12 (ప్రభ న్యూస్): యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి అని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతంరావు అన్నారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలను బిజెపి నగర కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌతమ్ రావు పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికాగో వేదికగా భారతదేశ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. నేటి ఆధునిక సమాజంలో అనేక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ యువత స్వామి వివేకానంద చెప్పిన సూక్తులను అనుసరించి విజయాలు సాధిస్తున్నారని గౌతంరావు అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, సీనియర్ నేతలు వీరెల్లి చంద్రశేఖర్, నంద కిషోర్, సూర్య ప్రకాష్ సింగ్, అజయ్, శ్యామ్ రాజ్, నాగభూషణ్ చారి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement