Sunday, April 28, 2024

HYD: భారత్ vs ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ కు పటిష్ట భద్రత.. సీపీ సుధీర్ బాబు

ఈనెల‌ 25వ తేదీ నుండి 29వ తేదీల మధ్య ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేస్తున్న‌ట్లు రాచ‌కొండ క‌మిష‌న‌ర్ సుధీర్ బాబు తెలిపారు. ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్ రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్నిరకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశం అని, ఎన్ని సవాళ్ళు ఎదురైనా తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

మీడియా ప్రతినిధులకు, ఇతరులకు ఇచ్చే పాసుల జారీలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్టేడియం పరిసరాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు. టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డీసీపీ మల్కాజ్ గిరి పద్మజ ఐపిఎస్, ఎస్ బీ డీసీపీ కరుణాకర్, ట్రాఫిక్ డీసీపీ 1 మనోహర్, అడ్మిన్ డీసీపీ ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement