Tuesday, April 23, 2024

కేసీఆర్ సీఎం అయ్యాకే విద్యారంగానికి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

కేసీఆర్ సీఎం అయిన తర్వాతే విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నార‌ని, అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేన‌ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ నాగోల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసంద‌ర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… అంతకు ముందున్న ప్రభుత్వాలు విద్య వ్యవస్థను పట్టించుకున్న దాఖలాలు లేవని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో విద్యా రంగ వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నార‌న్నారు.


ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సీనియర్ ఉపాధ్యక్షులు కాచం కృష్ణమూర్తి గుప్తా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రెటరీ పబ్బ చంద్రశేఖర్ గుప్తా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పొలిటికల్ కమిటీ చైర్మన్ బచ్చు శ్రీనివాస్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ కూర నాగరాజు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ ట్రెజరర్ కోడిప్యాక నారాయణ గుప్తా, ఉడుత పురుషోత్తం, కాచం కృష్ణమూర్తి, కాసం వెంకట హరి గుప్తా, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బోనగిరి శ్రీనివాసులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సంబు పాండయ్య గుప్తా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా సెక్రెటరీ ట్రెజరర్ శ్రీనివాస్ గుప్తా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ అడ్వైజర్ అండ్ ట్రెజరర్ వూరే నగేష్ గుప్తా, గట్టు ప్రకాష్, కొత్తపల్లి రమేష్, గంగిశెట్టి వెంకటేశం, పల్లెర్ల బిక్షపతి, మంజునాథ్ గుప్తా, శ్రావణ్ కుమార్ గుప్తా, దారం వెంకటేష్ గుప్తా, పూల వెంకటేష్ గుప్తా, పోకల సత్యనారాయణ గుప్తా, బురుగు శ్రీనివాస్ గుప్తా, ఇంటర్నేషనల్ మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, సెక్రటరీ లంకెలపల్లి మంజుల, చీఫ్ అడ్వైజర్ కలకొండ మణిమాలజ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ బచ్చు నవనీత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవి, రఘునందన్ రావు, వెంకటేష్, శ్రీదేవి, శేషిరెడ్డి, సుధాకర్, విమల, శివయ్య, గోవర్ధన్, నీరజ, ఆర్యవైశ్య సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement