Friday, May 3, 2024

నిధులు కేటాయిస్తారు….ఖ‌ర్చే చేయ‌రుః బడ్జెట్ పై రాజాసింగ్ విసుర్లు..

హైదరాబాద్: బ‌డ్జెట్ లో కేటాయింపులు ఘ‌నంగానే ఉంటాయని, అయితే వాటిని ఖ‌ర్చు మాత్రం చేయ‌ర‌ని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.. అసెంబ్లీలో నేడు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ ప‌ద్దులు కేవ‌లం పుస్తకాలకే పరిమిత‌మ‌ని‌ అన్నారు. మూసీ నదికి గ‌తంలో కేటాయించిన కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. క్రీడా రంగానికి ఒక్క రూపాయి కేటాయించలేదని సీరియస్ అయ్యారు. ఎల్బీ స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్‌గా మారిపోయింద‌ని అన్నారు. .హెల్త్ కోసం భారీగానే కేటాయింపులు చేశారని అంటూ కానీ అవి ఎక్కడ ఖర్చుచేస్తారో చూడాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్ కట్టడానికి వందల కోట్లు ఖర్చు చేస్తామన్నార‌ని అయితే ఇంత వ‌ర‌కూ రూపాయి కూడా ఖర్చు చేయలేద‌ని ఎత్తిపొడిచారు… నగరంలోని దూల్ పేటలో గుడుంబా నివారణ చేసి.. వారికీ ఉపాధి కల్పిస్తామన్న హామీ ఏమైంద‌ని నిల‌దీశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement