Sunday, April 28, 2024

Music: సంగీత సాగరంలో ఓలలాడించిన ముజిగల్ అకాడమీ

హైదరాబాద్: ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రతిభను పెంపొందించడానికి అంకితమైన ప్రముఖ సంగీత శిక్షణా సంస్థ అయిన ముజిగల్ అకాడమీ, ఒక విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయకులు సాయి శ్రీ చరణ్, సాయి వల్లి శివాని పాల్గొని మంత్రముగ్ధులను చేసే సంగీత కచేరీని చేశారు. వీరితో పాటుగా ఓపెన్ మైక్ సెషన్ లో సరేగమప విజేతలు, గాయకులు వాగ్దేవి, శశాంక్‌ల సమక్షంలో సాయంత్రం సంగీత వైభవానికి అదనపు కోణాన్ని జోడించారు. అన్ని మూజిగల్‌ అకాడమీలలో జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు మరపురాని ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈసంద‌ర్భంగా ముజిగల్ అకాడమీ వ్యవస్థాపకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… ప్రపంచ సంగీత దినోత్సవం రోజున ఇలాంటి మరపురాని కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సంగీతానికి అందరినీ ఏకం చేసే శక్తి వుందన్నారు. దానికి ఎల్లలు లేవని, ఈ కార్యక్రమం ద్వారా కళాకారులు, వర్ధమాన ప్రతిభావంతులకు ఒక వేదికను అందించడమే త‌మ లక్ష్యమ‌న్నారు. సాయి శ్రీ చరణ్, సాయి వల్లి శివాని, వాగ్దేవి, శశాంక్, పాల్గొన్న వారందరికీ తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తాము త‌మ విద్యార్థుల సంగీత ఆకాంక్షలను పెంపొందించడానికి, వారికి అసాధారణమైన అభ్యాస అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, సంగీత ఔత్సాహికుల ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement