Sunday, May 5, 2024

TS | డ్యూలింగ్‌ పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌.. ఏడుగురి అరెస్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అంతర్జాతీయ వర్శిటీల్లో ప్రవేశ అర్హత కోసం నిర్వహించే డ్యూలింగ్‌ పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతోన్న ఏడుగురిని ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హయత్‌నగర్‌లోని వెంకటేశ్వర లాడ్జిలో ఓ గది అద్దెకు తీసుకుని వీరంతా మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అమెరికా, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లోని వివిధ విశ్వ విద్యాలయాల్లో చేరాలనుకునే వారి కోసం ఈ డ్యూలింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు.

ప్రవీణ్‌ రెడ్డి, అరవింద్‌ రెడ్డి, హరినాథ్‌, కృష్ణ, సంతోష్‌, నవీన్‌ కుమార్‌, వినయ్‌ అనే వ్యక్తులు ఆన్‌ లైన్‌లో ఒకరికి బదులుగా పరీక్ష రాస్తుండగా.. వీరిని గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు హోటల్‌పై దాడి చేసి వారిని అరెస్ట్‌ చేశారు. పరీక్ష రాసేందుకు ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు ఎస్‌వోటీ పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి 5 ల్యాప్‌ టాప్స్‌, 4 పాస్‌ పోర్టులు, 7 మొబైల్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను హయత్‌నగర్‌ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement