హైదరాబాద్: ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (ఐఎంఈఏ)లో దాని వృద్ధి నిబద్ధతలో భాగంగా, లుబ్రిజోల్ అడిటివ్స్ ఐఎంఈఏ వైస్ ప్రెసిడెంట్గా, లుబ్రిజోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నితిన్ మెంగి కంపెనీలో చేరనున్నట్లు లుబ్రిజోల్ ప్రకటించింది. ఈసందర్భంగా లుబ్రిజోల్ ఎడిటివ్స్ ఎస్వీపీ, ప్రెసిడెంట్ ఫ్లావియో క్లిగర్ అన్నారు. ఐఎంఈఏ అంతటా తమ ప్రాధాన్యతలను లుబ్రిజోల్ కొనసాగించింది, తమ ప్రాంతీయ నాయకత్వ బృందానికి ఈ జోడింపు తమ పనిని వేగవంతం చేయడంలో సహాయపడుతుందన్నారు.
ఆసియా పసిఫిక్, ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికాతో సహా పలు ప్రాంతాల్లో గ్యాస్, ఆయిల్స్ పరిశ్రమలో క్రాస్-ఫంక్షనల్ టీమ్లకు నేతృత్వం వహించిన 20సంవత్సరాలకు పైగా అనుభవాన్ని నితిన్ తీసుకువచ్చారు. అతను పెట్రోలియం, పెట్రోకెమికల్స్పై దృష్టి సారించి మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీని అందుకున్నారు . భారతదేశంలోని ఘజియాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ నుండి ఎంబీఏ ను ఆయన చేశారు. పరిశ్రమలో లుబ్రిజోల్ నాయకత్వం గురించి నాకు కొంత కాలంగా తెలుసు, సంస్థ పై గౌరవం ఉందన్నారు. లుబ్రిజోల్ భవిష్యత్తు కోసం ఆకట్టుకునే ప్రణాళికల్లో భాగమైనందుకు తాను ఇప్పుడు సంతోషిస్తున్నానన్నారు.