Wednesday, May 1, 2024

సాయి చంద్ మృతి పట్ల కేటీఆర్‌ దిగ్భ్రాంతి – సాంస్కృతిక రంగంలో సాయి పేరు చిరస్థాయిగా నిలిచి పోతుందంటూ సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌ మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. యువకుడైన సాయిచంద్‌ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేద వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన ఆయన మరణం పార్టీకి తీరని లోటని చెప్పారు. సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్‌ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని తెలిపారు. సాయిచంద్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement