Monday, April 29, 2024

ఒకశాతం మంది మాత్రమే లాక్‌డౌన్ ఉల్లంఘిస్తున్నారు: సీపీ

హైదరాబాద్‌లో గడిచిన 17 రోజులుగా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పాతబస్తీలో లాక్‌డౌన్ అమలును ఆయనతో పాటు అడిషనల్ సీపీ చౌహాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ… 99 శాతం మంది ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం 1% ప్రజలే అనవసరంగా బయటకు వస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని గుర్తించి కేసులు పెడుతున్నట్లు తెలిపారు.

మరోవైపు ప్రతిరోజూ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9వేల లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయని, ఆరువేల వాహనాలు సీజ్ అవుతున్నట్లు సీపీ వెల్లడించారు. నగరంలో 180 చెక్‌పోస్టుల వద్ద 24 గంటల పాటు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement