Saturday, September 21, 2024

ఉద్యమాలకు ఊపిరి పోసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ : మంత్రి త‌ల‌సాని

ఉద్యమాలకు ఊపిరి పోసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ జయంతిలో మంత్రులు తలసాని, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మహానీయులను మరింత ఉన్నతంగా గౌరవిస్తుందన్నారు. తన ఇంటినే తెలంగాణ ఉద్యమ కార్యాలయంగా కొండా లక్ష్మణ్ మార్చారని తెలిపారు. చేనేతల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. మహిళలకు బతుకమ్మ సందర్భంగా పంపిణీ చేస్తున్న చీరలను చేనేతలు తయారీ చేసినవే అని చెప్పుకొచ్చారు. వచ్చే సంవత్సరం నుండి కొండా లక్ష్మణ్ జయంతి గొప్ప పండుగగా ఘనంగా జరపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement