Wednesday, May 15, 2024

HYD: మార్చి 9 వరకు హైదరాబాద్‌ లో గో స్వదేశీ చేనేత ప్రదర్శన

హైదరాబాద్‌ : భారతదేశపు మొట్టమొదటి ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌, చేనేత మార్కెటింగ్‌ (ఈ-కామర్స్‌) కోసం భారత ప్రభుత్వం నుండి మొదటి జాతీయ అవార్డును గెలుచుకున్న గో స్వదేశీ ఫిబ్రవరి 24 నుండి మార్చి 3 వరకు 9 రోజుల పాటు- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కళింగ కల్చరల్‌ హాల్‌లో చేనేత ప్రదర్శనను నిర్వహిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు, కళాకారులచే ప్రామాణికమైన చేనేత చీరలు, బట్టలు, దుస్తుల సామాగ్రి, స్టోల్స్‌, దుపట్టాలు, పురుషుల దుస్తులు, గృహాలంకరణ, అనుబంధ ఉత్పత్తులను గో స్వదేశీ ప్రదర్శిస్తుంది. ఈ 9 రోజుల కార్యక్రమం హస్తకళాకారులకు మద్దతు ఇవ్వడం, చేతితో నేసిన, చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించటం లక్ష్యంగా పెట్టు-కుంది. గో స్వదేశీలో ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ నుండి చేనేత కార్మికులు తీర్చిదిద్దిన సమకాలీన, సాంప్రదాయ చేనేత దుస్తులు ప్రదర్శిస్తున్నారు.

కర్ణాటకలోని అత్యద్భుతమైన సిల్క్‌ చీరలు, శక్తివంతమైన బెంగాల్‌ జమ్‌దానీలు అండ్‌ తంగైల్‌ చీరల నుండి మహేశ్వరీలు అండ్‌ చందేరీల సున్నితమైన సొగసుల వరకు, గో స్వదేశీలోని కలెక్షన్‌ ఎంపిక మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అందమైన అల్లికలు, డిజైన్‌లతో పాటు-, మీరు కాలాతీత క్లాసిక్‌ల శ్రేణి నుండి కూడా ఎంచుకోవచ్చు. ఈ కార్యక్రమం భారతదేశం గొప్ప చేనేత అండ్‌ హస్తకళల సంప్రదాయాన్ని ప్రదర్శిస్తుంది. నేత కార్మికులు, కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. గో స్వదేశీ ఎగ్జిబిషన్‌ని సందర్శించండి.. భారతీయ చేనేత అండ్‌ కళలను వేడుక చేయటంలో మాతో చేరండని ఆ సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement