Wednesday, May 1, 2024

ప్రపంచ అవార్డును గెలుచుకున్న మహిళా డెయిరీ ఫార్మర్స్ సంస్థ – శ్రీజ

హైదరాబాద్ : చికాగోలో జరుగుతున్న ప్రపంచ పాడిపరిశ్రమ సదస్సు వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడిస్తూ తిరుమల తిరుపతి బాలాజీ దేవాలయ పాదాల చెంత వున్న భారతీయ మహిళా డెయిరీ సంస్థ శ్రీజ, పాడి పరిశ్రమ రంగంలో మహిళా సాధికారతలో ఆవిష్కరణకు గానూ అవార్డును అందుకుంది. దాదాపు 120,000 మంది మహిళా పాడి రైతుల తరపున ఈ అవార్డును స్వీకరించిన శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జయతీర్థా చారి మాట్లాడుతూ… దేశంలోని మహిళా పాడి రైతులకు, సంస్థకు ఈ గౌరవం లభించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య, పశుసంవర్ధక అండ్ పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఏహెచ్ డీ) అల్కా ఉపాధ్యాయ పాల్గొన్నారు. ఈ అవార్డుపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎన్‌డిడిబి, ఎన్‌డిడిబి డెయిరీ సర్వీసెస్, శ్రీజ మిల్క్‌లను అభినందించారు.

ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ (ఐడీఎఫ్‌) బోర్డుకు ఎన్నికైన ఎన్ డీడీబీ అండ్ ఎన్ డీడీబీ డెయిరీ సర్వీసెస్ (ఎన్ డీఎస్) ఛైర్మన్ డాక్టర్ మీనేష్ షా మాట్లాడుతూ… భారతదేశంలో పాడి పరిశ్రమ విజయంలో మహిళలు అంతర్భాగంగా నిలిచారన్నారు. ఈ సంవత్సరం ఐడీఎఫ్‌ తమ మొదటి విమెన్ ఇన్ డెయిరీ నివేదికను విడుదల చేసిందన్నారు. శ్రీజ చైర్‌పర్సన్ కె.శ్రీదేవి మాట్లాడుతూ… అంతర్జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు, అవార్డు 1.20 లక్షల మంది మహిళా పాడి రైతు సభ్యులకు లభించిన గౌరవమ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement