Friday, May 17, 2024

ODI WC | రేపు బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్‌.. ఆట‌కు వానగండం!

ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్ జట్లు రేపు (గురువారం) పుణే వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు పై కాస్త ఉత్కంఠ ఉండ‌గా.. వాతావరణం మాత్రం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. టోర్నీలో మూడు వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు.. నాలుగో మ్యాచ్‌లో బంగ్లాతో ఆడనున్నది. మ్యాచ్‌కు ఒకరోజు ముందు పుణేలో వర్షం కురిసింది. అలాగే, గురువారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

కాగా, ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా వరుసగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, పాక్‌లను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. బంగ్లాపై సైతం విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింతే ఇరుజట్లకు ఒక్కో పాయింట్ ద‌క్కుతుంది. ఒక్క పాయింట్‌ వెనుకబడినా సెమీఫైనల్‌ రేసులో భార‌త్‌కు ఇబ్బందులు ఉంటాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఇక‌.. లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే సైమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో వర్షంతో బంగ్లా మ్యాచ్‌కు ఆటంకం కలిగితే ఒక పాయింట్‌ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు వర్షం కారణంగా ఏ మ్యాచ్‌ కూడా రద్దుకాకపోవడం ఊరట కలిగించే విషయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement