Sunday, April 28, 2024

Fish Prasadam – చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని

హైదరాబాద్ – ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఇక‌.. చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు హైద‌రాబాద్ సిటీతో పాటు ఇత‌ర జిల్లాలు, రాష్ట్రాల‌ నుంచి వేలాది మంది నాంప‌ల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి తరలివచ్చారు.

చేపప్రసాదం పంపిణీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ఇప్పటికే బారులు తీరారు మత్స్యశాఖ ఆరు లక్షల చేప పిల్లలను సిద్ధంగా ఉంచి అవసరమైన మేరకు ఎగ్జిబిషన్‌ మైదానానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. వీటిని 32 కౌంటర్ల ద్వారా పంపిణీ జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కిటకిటలాడుతున్న ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌..

ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి ఉబ్బస వ్యాధిగ్రస్తులు, వారి సహాయకులు పెద్ద ఎత్తున‌ తరలిరావడంతో నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్ సంద‌డిగా మారింది. అక్క‌డికి చేరుకున్న వారికి ఫలహారాలు, భోజన సదుపాయాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాయి. క్యూలైన్లలో జనం నిండిపోయారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement