Tuesday, May 21, 2024

ఆర్టీసీ బ‌స్సులో మంట‌లు..

సికింద్రాబాద్ జూబ్లీ బ‌స్ స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ప‌ద‌కొండో ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న ఆర్టీసీ బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అక్క‌డున్న ప్ర‌యాణికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. జ‌న‌గాం డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు ప‌ద‌కొండో ప్లాట్‌ఫాంపై ఆగింది. ఈ స‌మ‌యంలో బ‌స్సులో విద్యుత్ తీగ‌లు షార్ట్ స‌ర్క్యూట్‌కు గురై మంట‌లు చెల‌రేగాయి.ఈ స‌మ‌యంలో బ‌స్సులో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement