Friday, May 3, 2024

TS : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం… మధుయాష్కీ గౌడ్

ఎల్బీనగర్, ఫిబ్రవరి 22(ప్ర‌భ‌న్యూస్‌): ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం డివిజన్ శక్తి నగర్ కాలనీకి చెందిన ఐతరాజ్. రాజు కుమార్తె హర్షిత అనారోగ్య సమస్యతో తీవ్ర ఇబ్బండిపడుతుంది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం వనస్థలిపురం కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు కుట్ల నర్సింహా యాదవ్‌కు తెలియజేయడంతో అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్‌వోసీ ద్వారా రూ. 2.50ల‌క్ష‌లు ఏఐసిసి కార్యదర్శి మధుయాష్కీ మంజూరు చేయించారు. కాగా గురువారం మంజూరైన ఎల్‌వోసీ పత్రాన్ని బాధిత కుటుంబ సభ్యులకు మధుయాష్కీ గౌడ్ అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement