Sunday, May 5, 2024

పోస్టాఫీసుల్లో బోనాల సేవల బుకింగ్‌ సదుపాయం.. ప్రసాదం నేరుగా భక్తుల ఇంటికే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : స్వయంగా ఆలయాలకు రాలేని వారు ఆషాడం బోనాల సందర్భంగా అమ్మవారిని పూజించి ప్రసాదం స్వీకరించాలనుకునే వారి కోసం తెలంగాణ దేవాదాయ శాఖ పోస్టల్‌ శాఖ సేవలు వినియోగించుకుంటోంది. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ గుడి, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో కళ్యాణం సేవ, బోనం సేవలను హైదరాబాద్‌ రీజియన్‌లోని 547 పోస్టాఫీసుల్లో భక్తులు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

ఈ నెల 30వ తేదీ నుంచి జులై 27వ తేదీ వరకు ఎప్పుడైనా కళ్యాణం, బోనం సేవ బుక్‌ చేసుకోవచ్చని, బుక్‌ చేసుకున్న వారి తరపున ఆలయ వర్గాలు ఈ కార్యక్రమాలను నిర్వహించి ఆగస్టు 1 నుంచి వారి చిరునామాలకు ప్రసాదం పంపుతారని దేవాదాయశాఖ వర్గాలు తెలిపాయి. బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ గుడిలో కళ్యాణానికి రూ.500, బోనం సేవకు రూ.300, ఉజ్జయిని మహంకాళి గుడిలో బోనం సేవ రూ.300గా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement