Thursday, April 25, 2024

Breaking: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం : ఇద్దరు మృతి

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అందులో ఇద్దరు చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన నిజాంపేట వినాయక్ నగర్‌లో చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అమ్మమ్మ లలిత (56), తల్లి దివ్య (32), శివ కార్తికేయ (18) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అమ్మమ్మ లలిత ,శివ ఇద్దరు మృతి చెందగా.. తల్లి దివ్య పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు ఆమెను స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం దివ్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement