Saturday, May 4, 2024

ఇద్ద‌రు ఎస్‌వోటీ కానిస్టేబుల్స్‎ పై దాడి..

ఇద్ద‌రు ఎస్‌వోటీ కానిస్టేబుల్స్‎ పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌ హైద‌రాబాద్ లోని కూకట్‎పల్లిలో చోటుచేసుకుంది. సిక్కుల బస్తీలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఇద్దరు ఎస్‌వోటీ కానిస్టేబుళ్ల‌ పై తల్వార్‎తో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఓ కేసు దర్యాప్తు కోసం వెళ్లిన కానిస్టేబుళ్ల‌ పై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో రాజు అనే కానిస్టేబుల్ ఛాతిలో పొడవగా.. తీవ్రగాయాల పాలయ్యాడు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. మరో కానిస్టేబుల్ వినయ్ తలకు గాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement