Saturday, May 11, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన అర్చ‌న సురేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి విసిరిన ఛాలెంజ్ స్వీకరించి ప్రశాసన్ నగర్ జీహెచ్ఎంసీ పార్క్ లో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ అర్చన సురేష్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషంగా ఉందని తెలిపిన అర్చన.. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో గ్రీనరి శాతం తక్కువగా ఉన్నదని, దాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంద‌న్నారు. అనంతరం తన స్నేహితులు శ్రవణ్ కాసం, కెప్టెన్ అంకుర్ ఆంగ్రీష్, స్ఫూర్తి ముగ్గురికి అర్చ‌న‌ ఛాలెంజ్ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement