Saturday, May 4, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన న‌టి అర్చ‌న అనంత్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో తన తండ్రి కన్నడ నటుడు అనంత వేలుతో క‌లిసి కార్తీకదీపం సీరియల్ ఫేమ్ నటి అర్చన అనంత్ (సౌందర్య) మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అర్చన అనంత్ మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన తండ్రితో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఇందులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నటుడు అనంత వేలు మాట్లాడుతూ… భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. భూమాతకు ఆభరణం పచ్చదనం అని.. ప్రతి ఒక్కరూ వీలైనన్ని మొక్కలు నాటి పచ్చదనంతో నింపాలని కోరారు. మంచి ఆక్సిజన్ లభించాలన్నా ఆరోగ్యకరమైన జీవనం గడపాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అర్చన, అనంత వేలు పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement