Wednesday, May 1, 2024

AirAsia: విశాఖపట్నం-కౌలాలంపూర్ కు విమానాలను తిరిగి ప్రారంభించిన ఎయిర్ ఏషియా

హైద‌రాబాద్: విమానయాన రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది ఎయిర్ ఏషియా. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఎయిర్ ఏషియా.. ఎప్పటికప్పుడు తన విస్తారమైన నెట్‌వర్క్‌ను భారతదేశం నుండి మలేషియాకు వ్యాపింప చేస్తూనే ఉంది. అందులో భాగంగా తాజాగా… విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌కు తిరిగి విమానాలను ప్రారంభించినట్లు ప్రకటించింది.

కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నానికి డైరెక్ట్ ఫ్లైట్ సేవలు అందిస్తున్న ఏకైక విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా కావడం విశేషం. ఈ సందర్భంగా ఎయిర్ ఏషియా ఏవియేషన్ గ్రూప్ సీఈఓ బో లింగం మాట్లాడుతూ… తమకు అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒకటి భారతదేశమన్నారు. తాము అందరి ప్రయాణాన్ని సరసమైనదిగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం వల్ల వినియోగదారుల నుంచి రోజురోజుకి మద్దతు పెరుగుతుందన్నారు.

ఈ నేపథ్యంలో తమ కనెక్టివిటీని మరింత పెంచుకుంటూ ముందుకు సాగేందుకు ఎయిర్ ఏషియా సిద్ధంగా ఉందన్నారు. విశాఖపట్నం నుండి కౌలాలంపూర్‌కు డైరెక్ట్ ఫ్లైట్ అనేది తమ విస్తరణ ప్రణాళికలో ప్రధాన అంకమన్నారు. ఈ ఏడాది భారతదేశం నుండి ఇది తమ నాలుగో రూట్ అని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఎయిర్ ఏషియా భారతదేశంలో తమ ఉనికిని మరింత విస్తరించడానికి తమ రెండు దేశాల మధ్య, వెలుపల మరింత సరసమైన కనెక్టివిటీని అనుమతించాలని చూస్తోందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement