Thursday, May 2, 2024

HYD: బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

బాలాపూర్, ఆగస్టు 22, ప్రభ న్యూస్ :బాలికపై సామూహికగా అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి నందనవనంలో బాలికపై అత్యాచారం చేసినట్లు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, రాంరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, కాంగ్రెస్ నాయకులు మల్ రెడ్డి రామిరెడ్డి, బాలికకు న్యాయం చేయాలని ఇవాళ నందనవనం చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ, బాలికకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. గంటకు పైగా రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న మీర్ పేట్ సీఐ కిరణ్ కుమార్ వెంటనే ధర్నా చేస్తున్న నాయకులను అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టులతో పోరాటాలను ఆపలేరని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం జరిగేంత వరకు తల్లిదండ్రులకు అండగా నిలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement