Wednesday, May 1, 2024

ఎనిమిదో నిజాం నవాబు ముకరం ఝా బహదూర్ క‌న్నుమూత‌..

హైదరాబాద్ ‍ – ‍‍‍ ఎనిమిదో నిజాం నవాబు భర్కత్‌ అలీ ఖాన్‌ వల్షన్‌ ముకరం ఝా బహదూర్ కన్నుమూశారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లో అసఫ్ జాహీ టూంబ్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముకరం ఝా పార్ధివదేహాన్ని ఈ నెల 17న టర్కీ నుంచి నగరానికి తీసుకురానున్నారు. అనంతరం ఆయన బౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచనున్నారు. ముకరం ఝా హైదరాబాద్ చిట్టచివరి ఏడో నిజాం రాజు అయిన మిర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్‌ మనుమడు. మిర్ హిమాయత్ అలీ ఖాన్ వురపు అజం జా బహదూర్, ప్రిన్సెస్ డుర్రు షెవర్ దంపతులకు 1933 అక్టోబర్‌ 6న జన్మించారు. ప్రిన్సెస్ డుర్రు షెవర్ టర్కీ చిట్ట చివరి సుల్తాన్ కుమార్తె కావడం గమనార్హం. కాగా, 1954, జూన్‌ 14న ప్రిన్స్‌ ముకరం ఝాను మిర్‌ఉ స్మాన్‌ అలీఖాన్‌ తన వారసుడిగా ప్రకటించారు. దీంతో 1971 వరకు హైదరాబాద్‌ యువరాజుగా పిలువబడ్డారు. 1954 నుంచి ముకరం ఝా హైదరాబాద్‌కు ఎనిమిదో రాజుగా గుర్తింపు పొందారు. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement