Friday, April 19, 2024

ఫిబ్ర‌వ‌రి 17న కెసిఆర్ చేతుల మీదుగా కొత్త స‌చివాల‌యం ప్రారంభం..

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం రోజున సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నూత‌న స‌చివాల‌యానికి నామ‌క‌ర‌ణం చేశారు.పాత స‌విచాల‌యంలోని 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.617 కోట్లతో గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో సచివాలయ నిర్మాణపనులు చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేశారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్‌ ఉంటాయి. ఇక బిల్డింగ్‌లోని రెండో అంతస్తు నుంచి మంత్రుల ఆఫీసులు ఉంటాయి. ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. విశాలమైన స్థలంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్‌ ఉంటుంది..తెలంగాణ సంస్కృతి ఉట్ట‌ప‌డేలా స‌చివాల‌యాన్ని నిర్మించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement