Sunday, May 5, 2024

Huzurabad – నన్ను గెలిపించకపోతే శవయాత్రకు రండి.. హుజురాబాద్ బారాసా అభ్యర్థి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించకపోతే నాలుగో తేదీన మా ముగ్గురి శవయాత్రకు రావాలని బారాసా అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం ఎన్నికల ప్రచార ముగింపు యాత్రలో భాగంగా మాట్లాడుతూ ప్రజలు దీవించి గెలిపిస్తే విజయ యాత్రకు వస్తానని లేకపోతే తనతో పాటు భార్య కుమార్తె ఆత్మహత్య చేసుకుంటామని మా శవయాత్రకు రావాలని చెప్పడం సంచలనంగా మారింది. గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తా లేకపోతే ముగ్గురి చావుకు కారణం అవుతారని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement