Thursday, May 2, 2024

BREAKING: విద్యుత్ షాక్‌తో భార్యాభర్తలు దుర్మరణం

విద్యుత్ షాక్ తో భార్యభర్తలు దుర్మరణం పాలైన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా బొమ్మరాసిపేట్ మండల పరిధిలోని బురాన్‌పూర్‌లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోయిని లక్ష్మణ్ (45), లక్ష్మి (40) దంపతులు కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇవాళ ఉదయం లక్ష్మణ్ ఉతికిన బట్టలను ఇంటి బయట రేకుల కింద ఉన్న తీగపై ఆరేయబోతుండగా.. ప్రమాదవశాత్తు తీగకు విద్యుత్ సరఫరా కావడంతో ఆయనకు షాక్ కొట్టింది. గమనించిన భార్య లక్ష్మి భర్తను కాపాడే క్రమంలో కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందారు.

అనుకోని ప్రమాదంలో భార్యభర్తలు మృతిచెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మణ్, లక్ష్మి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు ఇటీవలే వివాహం కాగా, కొడుకు సిద్ధార్థ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement