Friday, April 19, 2024

తెలంగాణ‌లో పేద‌కు ప‌ట్టా…కోటి ఇళ్లు , స్థ‌లాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి పేద కుటుంబానికి సొం తిళ్లు ఉండి తీరాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికా రులు కంకణబద్దులు కావాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రతి మండలం లోనూ అర్హులైన పేదలకు పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. పేదలకు సొంతింటి స్థలాలపై ఏర్పా-టైన కేబినెట్‌ సబ్‌ కమిటీ- పురపాలక శాఖ మంత్రి కేటీ- రామారావు అధ్యక్షతన సోమవారం బీఆర్‌కే ఆర్‌ భవన్‌లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయింపు, జీవో 58, 59 అమలు, సాదాబైనామా, నోటరీ పత్రాలు, ఎండోమెంట్‌, వక్ఫ్‌ భూములు తదితరాల అమలుకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టు-బడి ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి కుటు-ంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో 2014లో 1.25 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామన్నారు. జీవో 58 క్రింద 20,685 ఇళ్లకు సంబంధించి ఇప్పటికే వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇంటి స్థలాల పట్టాల జారీని వేగవంతం చేయాలని సబ్‌ కమిటీ- అధికారులను ఆదేశించిందని చెప్పారు. నోటరీ చేయబడిన పత్రాల గురించి ప్రస్తావిస్తూ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కేసుల ప్రక్రియను, సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ- అధికారులను ఆదేశించిందని వెల్లడించారు. పేదలకు అనుకూలమైన విధానాన్ని తీసుకోవాలని, అర్హత ఉన్న అన్ని కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు
.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి సిహెచ్‌ మల్లారెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎ-కై-్సజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇరిగేషన్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement