Saturday, March 16, 2024

TSPSCలో ‘వ‌ల‌పు’ ఎర – పేప‌ర్ లీక్…

హైద‌రాబాద్ – TSPSC లో కంప్యూట‌ర్ లు హ్యాక్ అయిన కేసులో విస్తుపోయే నిజాలు పోలీసులు విచార‌ణ వెల్ల‌డ‌య్యాయి.. ఒక్క కంప్యూట‌ర్ కూడా హ్యాక్ కాలేద‌ని, వ‌ల‌పు ఎర‌లో చిక్కిన ఈ సంస్థ ఉద్యోగి ప్ర‌శ్నాప‌త్రం లీక్ చేసిన‌ట్లు తేలింది..కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ పై ఓ యువతి వలపు వల విసిరిందని, ఈ ట్రాప్ లో చిక్కుకున్న ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు ప్రచారం జరిగినట్లు కంప్యూటర్ హ్యాక్ కాలేదని స్పష్టం చేశారు.

పేపర్ లీకేజీ ఆరోపణలతో దర్యాప్తు చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు టీఎస్ పీఎస్ సీ ఆఫీసుకు వచ్చిపోయే వారి వివరాలను పరిశీలించారు. రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలలో వెతికారు. దీంతో కొంతకాలంగా ఓ యువతి తరచుగా ఆఫీసుకు వస్తోందని గుర్తించారు. ఆమె తరచూ ప్రవీణ్ ను కలుస్తోందని తేలింది. టీఎస్ పీఎస్ సీ సెక్రెటరీ పీఏగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ తో సన్నిహితంగా మెలుగుతూ టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ ఇవ్వాలని అడిగింది. ఆమె కోసం ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్టు గుర్తించారు. నిందితుడు ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ‌ల‌పు ఎర యువ‌తి కోసం పోలీసులు గాలిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement