Monday, April 29, 2024

నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తెలంగాణ హైకోర్టు జడ్జిల రాక

కరీంనగర్ – తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లు కే. లక్ష్మనన్, పి. శ్రీ సుధా, యన్. లక్ష్మనన్, యన్. తుకారాంజి, పి. మాధవి దేవి, సూరేపల్లి నందా, అనుపమ చక్రవర్తి, సాంబశివ రావు నాయుడు, ఏ. సంతోష్ రెడ్డి, ఇ.వి.వేణుగోపాల్, కే. శరత్, జె. శ్రీనివాస రావు , నామవరపు రాజేశ్వరరావు లు నేడు బుధవారం వారం రోజున ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా 13 మంది జస్టిస్ లు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి దర్శనం చేసుకొని జగిత్యాల వెళ్తారు. జగిత్యాల పర్యటన అనంతరం మ. 3 – 30 ని. లకు కరీంనగర్ కు చేరుకొని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి వేణుగోపాల్ ఇంటిలో తినేటి విందును స్వీకరించి హైదరాబాద్ కు బయలుదేరుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement