Tuesday, March 26, 2024

భారీ వర్షం.. మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం

వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమయ్యింది. రైతు అనుముల కుమారస్వామి నాలుగెకరాల్లో వేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమయ్యిందని బోరున విలపించాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

అలాగే ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో రాత్రి కురిసిన అకాల వర్షాలకు మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిర్చి కోతల పని సగం వరకు పూర్తి కావడంతో కోసిన మిర్చిని గోదావరి పాయలో ఆరబెట్టారు. రాత్రి ఈదురు కాలులతో కూడిన భారీ వర్షానికి ఆరబెట్టిన మిర్చి నీళ్లలో కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement