Friday, April 26, 2024

Breaking | బ‌ర్రె కోసం వెళ్లి బ‌ల‌య్యాడు.. వ‌రంగ‌ల్ జిల్లాలో ఘ‌ట‌న‌

న‌ర్సంపేట (ప్ర‌భ న్యూస్‌): వరంగల్ జిల్లాలో దారుణం జ‌రిగింది. మేత‌కు వెళ్లిన బ‌ర్రెను తీసుకొచ్చే క్ర‌మంలో ఓ వ్య‌క్తి వాగులో చిక్కుకుని గ‌ల్లంత‌య్యాడు ఈ ఘ‌ట‌న ఇవ్వాల (సాయంత్రం) జ‌రిగింది. నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో బొల్లెని ఉప్పలయ్య ప్రమాదవశాత్తు వాగులో పడి చ‌నిపోయాడు. మాదన్నపేట గ్రామానికి చెందిన రైతు ఉప్పలయ్య తనకున్న రెండు ఎకరాల భూమిలో వరి సాగు చేశాడు. కోత త‌ర్వ‌త వడ్లను ఆరబోశారు.

కాగా, బర్రెను మేత కోసం తీసుకెళ్ల‌గా , అది మేత మేస్తూ వాగు దాటి వెళ్తింది. దీంతో ఆ బర్రెను అనుసరిస్తూ వాగులో దిగిన క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. బర్రె ఇంటికి వచ్చినప్ప‌టికీ ఉప్పలయ్య తిరిగా రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు అంత‌టా వెతికారు. ఈ క్రమంలో వాగు ఒడ్డుకు ఉప్పలయ్య చెప్పులు ఉండటం గమనించి గజ ఈతగాళ్ల సాయంతో వాగులో వెతికించారు. దీంతో ఉప్పలయ్య మృతదేహం బయటపడింది. మృత్తుడికి భార్య , ఇద్దరు కూతుళ్లున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement