Sunday, April 28, 2024

హరీషన్న సభకు తరలి రావాలి.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పిలుపు

మహిళా శిశు కేంద్ర భవనాన్ని ప్రారంభించేందుకు ఈనెల 4న పెద్దపెల్లి జిల్లా కేంద్రానికి వస్తున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావుకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలకాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన మాతాశిశు కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారని, మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు తరలి రావాలన్నారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోలోని అన్ని గ్రామాల నుండి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement