Friday, April 26, 2024

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లేఖ రాశారు. యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుపై లేఖ రాశారు. రాజ్ భవన్ కు వచ్చి బిల్లుపై చర్చించాలని రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. యూజీసీకి కూడా గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్ మెంట్ చేయడంపై గవర్నర్ తమిళిసై యూజీసీ అభిప్రాయం కోరారు. విశ్వ విద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని మూడేళ్లుగా చెబుతున్నా… ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement