Wednesday, May 1, 2024

అత్యంత వేగవంతంగా అభ్యున్నతి చెందుతున్న దేశం మనది – గవర్నర్ తమిళి సై

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి (ప్రభ న్యూస్)25: భారతదేశం అత్యంత వేగవంతంగా అభ్యున్నతి చెందుతున్న దేశమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళి సై సౌందర రాజన్ తెలిపారు. స్వయం శక్తితో ఎదుగుతున్న దేశంగా వెల్లడించారు. 20 దేశాలకు ఆధిపత్యం వహిస్తున్న సందర్భంలో భారతీయులమైన మనం అపారమైన గర్వం పొందుతున్నామని అన్నారు. తన కలను సాకారం చేసుకొనే దిశగా పయనించిందన్నారు.
జిల్లాలోని డిచ్ పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాల యంలో శనివారం జరిగిన “ఇండియాస్’ జి 20 ప్రెసిడెన్సీ ఆపర్చినిటీస్ అండ్ చాలెంజెస్ ఫర్ ఇండియా యాస్ ది గ్లోబల్ లీడర్” అనే అంశంపై జాతీయ సదస్సుకు గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళి సై సౌందర రాజన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉపకుల పతి ఆచార్య డి. రవీందర్ గవర్నర్ కి గౌరవ పూర్వకంగా స్వాగతం పలికారు. .7 వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది తో ‘గాడ్ ఆఫ్ ఆనర్’ (గౌరవ పూర్వక వందనం) చేశారు. వేద పండితుల ప్రవచనాలతో కూడి పూర్ణకుంభంతో గవర్నర్ కు స్వాగతం పలికారు.తెలంగాణ విశ్వవిద్యాలయం , అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహింపబ డుతున్న జాతీయ సదస్సును జ్యోతి ప్రజ్జ్వలన చేసి కార్యక్ర మాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా గవర్నర్ మాట్లా డుతూ… భారతదేశం G20 అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి న దృష్ట్యా, అత్యంత శక్తివంత మైన దేశాలకు నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో dగ్రూప్ ఆఫ్ నేషన్స్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), న్యూ ఢిల్లీ, దేశంలోని విశ్వవిద్యాల యాలు,అన్ని ఉన్నత విద్యా సంస్థలను తన G20 కింద విభిన్న కార్యక్రమాలను నిర్వ హించాలని ఆదేశించింద న్నారు. ఇది వరకు భారతదే శం ప్రపంచ దేశాల నుంచి అన్ని వస్తువులను ఎగుమతి చేసుకొ నేదని అన్నారు. కాని ఇప్పుడు భారత దేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు.
85% అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీలు మన దేశ సహకారం కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. కరోనా మహమ్మారిని తట్టుకొని వాక్సినేషన్ ను తయారుచేసి దాదాపు 150 దేశాలకు సరఫరా చేసిన ఘన త మన దేశానికి ఉందన్నారు. ఇదే గాక రుబెల్లా, పోలియో వ్యాధులకు వాక్సిన్ తయారు చేసి అతి ప్రాణాంతమైన వ్యాధులకు చికిత్సను అంది స్తుందన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు వంటి అనే నినాదంతో భారతదేశం సర్వ స్వతంత్ర దేశంగా ఎదుగుతుందని అన్నా రు. పెద్దవాళ్లను గౌరవించడం, వర్తమాన కాలంలో పరిస్థితుల కు అనుగుణంగా అవసరాలను తీర్చడం, భవిష్యత్ తరాలకు బంగారు బాటను అందించడం కోసం ప్రయత్నం చేయడం భారతదేశం మీద ఉన్న ఒక బాధ్యత అని ఆమె అన్నారు.
భారతదేశ చరిత్ర అజరామరం అయ్యిందన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ దేశాలకు శాంతి, అహింస మార్గాలను చూపిందన్నారు. భారతీయ ధార్మిక, ఆధ్యాత్మిక, తాత్త్విక, భక్తి సాక్షాత్కారం యోగా వల్ల కలుగుతుం దన్నారు. భారతదేశం చూపిన యోగా ధ్యాన విద్య అంతర్జా తీ య పరంగా మంచి మార్గాన్ని నిర్దేశించిందన్నారు. ఈ 2023 వ అంతర్జాతీయ యోగా దినో త్సవాన్ని “ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిల్లెట్స్” అనే సంక్షిప్త సందేశంతో ముందుకు వెళ్తుం దని అన్నారు. సంపూర్ణ చిరు ధాన్యాల ఆహారం మన భార తీయుల సంస్కృతి. ఇలాంటివి అలవాటు చేసుకోవాలని అన్నారు. భవిష్యత్తు తరాలకు పరిసరాల పరిశుభ్రతతో పాటుగా, పచ్చదనం అలవాటు చేసుకొనే విధంగా శిక్షణ ఇవ్వా లని అన్నారు. విద్యార్థులు వ్యక్తిగత స్వయం సమృద్ధిని సాధించే దిశగా పయనించాలని అన్నారు. ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా ఎదగడానికి ఉన్న చాలెంజెస్ ఏమిటో వివ రించారు. ఇదివరకు NEP 2020 ద్వారా క్లాస్ రూం నుంచి గ్లోబల్ గా ఎదగడానికి అను వైన సబ్జెక్టులు ఉన్నాయని అన్నారు. ప్రపంచ దేశాలలో పరిణామాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యా, విజ్ఞానం సాధిస్తూ స్కాలర్ షిప్ లను పొందాలని అన్నారు. తరత రాల నుంచి మన దేశం ప్రసాదించిన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రపంచ దేశాలలో సంక్షోభాన్ని ఎదుర్కం టున్న ఉక్రేయిన్, సిరియా దేశాలకు స్నేహ వారధి అందిం చవలసిన అవసరం ఉందని అన్నారు. మనం మన దేశ పౌరులుగా దేశంలో జీవిస్తున్నందుకు గర్వ పడాలని అన్నారు. విద్యార్థులు స్వాతం త్ర సమరయోధుల జీవిత చరిత్రలను చదివి స్ఫూర్తి పొందాల్ని అన్నారు. యువత ఏదైనా సాధించగలరని అసాధా రణ ప్రతిభ ఉంటుందని అన్నా రు.ఈ కార్యక్రమంలో ఉపకుల పతి ఆచార్య డి. రవీందర్, ఎ బి ఆర్ ఎస్ ఎం జాతీయ సంయు క్త కార్యనిర్వహణా కార్యదర్శి శ్రీ గుంత లక్ష్మణ్ జీ, రిజిస్ట్రార్ ఆచార్య బి. విద్యావర్ధిని, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి, వీసీ గారి సతీమణి శ్రీమతి సౌభాగ్యలక్ష్మి, సదస్సు డైరెక్టర్ డా. సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement