Sunday, May 5, 2024

HYD : విద్యార్థులకు గుడ్ న్యూస్… హైదరాబాద్ మెట్రోలో స్టూడెంట్ పాస్‌

హైదరాబాద్ మెట్రో రైల్ విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. మెట్రో రైళ్లలో స్టూడెంట్ పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. విద్యార్ధులు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిపుల్లో ప్రయాణించవచ్చని పేర్కొంది. 2024 మార్చి 31 వరకు విద్యార్ధులకు పాస్ సదుపాయం వుంటుందని తెలిపింది. ఏప్రిల్ 1, 1998 తర్వాత జన్మించిన విద్యార్ధులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. ఇవాళ్టీ నుంచే స్టూడెంట్ పాస్ అందుబాటులో వుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement