Wednesday, July 24, 2024

TS: సింగరేణి కార్మికులకు శుభవార్త… వయోపరిమితి 35నుంచి 40ఏళ్లకు పెంపు

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త తెలిపింది. కారుణ్య నియామకాల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 35ఏళ్లు ఉన్న వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచుతూ ఇవాళ సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నది.

2018 మార్చి 9 కటాఫ్ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ వెల్లడించారు. ఈ ఉత్తర్వులతో 300 మంది నిరుద్యోగులు తక్షణమే లబ్ది పొందనున్నారు. దీంతో సింగరేణి కార్మికుడు మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌కు గురైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement