Monday, April 29, 2024

shamshabad: ఎయిర్‌పోర్టులో రూ.1.05కోట్ల విలువైన బంగారం స్వాధీనం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్టులో సుమారు రెండు కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అండ్‌ విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణిలను తనిఖీ చేయగా.. పేస్టు రూపంలో ఆరు క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.1.05 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement