Monday, May 6, 2024

Ghatkesar – కాంగ్రెస్ లో చేరిన మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఘట్ కేసర్, అక్టోబర్ 18 ( ప్రభ న్యూస్ ) : టిపిసిసి అధ్యక్షులుఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శర చంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఘట్కేసర్ మండలం లోని ప్రతాప సింగారం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బుధవారం మ‌ధ్యాహ్నం చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య రేవంత్ రెడ్డి శరత్ చంద్రారెడ్డికి సుధీర్ రెడ్డికి వారి అనుచరులకు కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని అవినీతి, కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement