Monday, April 29, 2024

అన్నదాతలకు అన్నం పెట్టడం పూర్వ జన్మ సుకృతం – మంత్రి గంగుల

లోకానికే అన్నం పేట్టే అన్నదాతకు అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతమను, ఇలాంటి కార్యక్రమంలో నేను భాగస్వామిని కావడం ఆనందంగా ఉందనీ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వర్షాకాలం ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అన్నదాతలు ఆకలితో పస్తు ఉండొద్దనే ఉద్దేశ్యంతో… కరీంనగర్ ఏఎంసి పాలకవర్గం… మంత్రి గంగుల కమలాకర్ సొంత డబ్బులతో… రైతులకు మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి రోజు మధ్యాహ్నం వేళ రుచికరమైన భోజనాన్ని అందిస్తూ… రైతుల సేవలో తరిస్తుంది. ఈ మధ్యాహ్న భోజనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై… మధ్యాహ్న బోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు

. రైతులకు తానే స్వయంగా వడ్డించి… భోజనం రుచి ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు కరీంనగర్ ఏఎంసికి వచ్చే రైతులకు… మధ్యాహ్నం భోజనం పెడుతున్న ఏఎంసి చైర్మన్ రెడ్డ వేణి మధు తో పాటు పాలకవర్గాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోకానికే అన్నం పెట్టే అన్నదాతలకు… అన్నం పెట్టాలని మార్కెట్ కమిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి గంగుల స్వాగతించారు. తెలంగాణ రాకముందు వ్యవసాయం చేసేందుకు అరిగొసపడ్డ రోజులుండేవని గుర్తు చేసుకున్నారు. ఐదెకరాల భూమి ఉంటే… రెండున్నర ఎకరాల భూమిని సాగుచేసేందుకు కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులుండేవన్నారు. పక్కనే గోదారి పారుతున్న చుక్కా నీరు రాక… సాగు నీటి కోసం మొగులు వైపు దుక్కి దున్నిన రోజులుండేవన్నారు. సాగు నీరు లేక… కరెంట్ రాక… ఎరువులు దొరక్క… చివరకు రైతుల డొక్కలు మాడిన పరిస్థితిలుండేవన్నారు. నాణ్యమైన కరెంట్ రాక… కాలిపోయిన ట్రాన్స్ పార్మర్ ప్లేస్ లో కొత్తది కావాలని ధర్నాలు చేసి… కాలు విరగొట్టుకున్న రోజుందంటూ ఆవేదనవ్యక్తం చేశారు. కానీ… స్వయం పాలనలో… సిఎంగా కెసిఆర్ గద్దెనెక్కిన తర్వాత పరిస్థితులు మారాయని… కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి మండుటెండల్లో మత్తడి దూకించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

ఇప్పుడు కరెంట్ బిల్లు లేదు… నీటి పన్ను లేదని… సిఎం కెసిఆర్ తీసుకున్న చర్యలతో బీడుపడ్డ భూములన్ని సాగులోకి వచ్చి… భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయన్నారు. గతంలో రైతు పండించిన పంటను అమ్ముకోవాలంటే కిలోమీటర్ల మేర ధాన్యాన్ని తీసుకువెళ్ళాల్సిన పరిస్థితులుండేవని… కానీ… స్వయం పాలనలో గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి… రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తున్నామన్నారు. క్యాష్ కట్టింగ్ పేరుతో డబ్బుల్లో కోత లేకుండా… కొనుగోలు చేసిన వారం రోజుల్లోపే… రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. తెలంగాణ పచ్చగా ఉండడం… ఇక్కడి రైతులు సంతోషంగా ఉండడాన్ని చూడలేని ఢిల్లీ పార్టీలు విషం చిమ్ముతున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు. ఢిల్లీ గద్దలు… ఇక్కడి నీటిని… బొగ్గును… కరెంట్ ను దోచుకుపోయి… మళ్ళీ తెలంగాణను గుడ్డిదీపం చేసేందుకు కుట్రలు పన్నుతుంటే… తెలంగాణ రక్షకుడిగా సిఎం కెసిఆర్ వారి పై యుద్దం చేస్తున్నారన్నారు. సర్వలోక కళ్యాణార్థం దేవతలు యాగాలు… యజ్ఞాలు… చేస్తే… రాక్షస్తులు అందులో రక్తం పోసేవారని పురాణాలు చెబుతున్నాయని…. ఇప్పుడు ఢిల్లీ పాలకులు కూడా పురాణాలను రీపిట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రక్షకుడు కేసిఆర్ మాత్రమేనని… మన సిఎం కెసిఆర్ కు మనం అండగా ఉండి… మన తెలంగాణను కాపాడుకుందామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement