Tuesday, May 7, 2024

HYD | గణపతి నిమజ్జనోత్సవం.. మెట్రో రైళ్ల వేళలు పొడిగింపు!

మెట్రో ప్రయాణికులకు హెచ్ఎంఆర్​ గుడ్​ న్యూస్​ చెప్పింది. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లను నడుపనున్నట్లు పేర్కొన్న అధికారులు.. రాత్రి 2 గంటల వరకు ఆయా రైళ్లు చివరి గమ్యస్థానానికి చేరుకుంటాయని తెలిపారు.

ఖైరతాబాద్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, అదనంగా రైళ్లు నడపనున్నట్లు వివరించారు. మళ్లీ 29న ఉదయం 6 గంటలకు యథాతథంగా మెట్రో కార్యకలాపాలు కొనసాగుతాయని వివరించారు. మెట్రో సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement