Thursday, May 2, 2024

Gajwel – కెసిఆర్ ను ఓడిస్తేనే తెలంగాణకు విముక్తి … ఈట‌ల రాజేంద‌ర్

గ‌జ్వేల్ – కెసిఆర్ ను ఓడిస్తేనే తెలంగాణ‌కు విముక్తి క‌లుగుతుంద‌ని అన్నారు బిజెపి చేరిక‌ల క‌మిటీ క‌న్వీన‌ర్ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు.. గజ్వేల్ నియోజకవర్గం, తూప్రాన్ మండలం, ఇమాంపూర్ లో నేడు జ‌రిగిన ఎన్నికల ప్రచారంలో ఆయ‌న మాట్లాడుతూ, ఇమాంపూర్ గ్రామంలో 652 ఎకరాల భూమి 50 ఏళ్ల క్రితం దళితులకు అసైన్డ్ చేశార‌ని, . ఆ భుముల మీద కెసిఆర్ కన్ను పడింద‌న్నారు.. ఇప్ప‌టికే ఆ భూముల‌ను గుంజుకోవడానికి నోటీసులు ఇచ్చార‌న్నారు.. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ద‌ళిత‌లుకే ఆ భూమి తిరిగి వారికే అప్పగిస్తామని అన్నారు..

కెసిఆర్ వల్ల గజ్వేల్ ప్రజలు కన్నీళ్లు పెడుతున్నార‌ని ఆరోపించారు. తుఫ్రాన్ మండలం, మనోహరబాద్ మండలంలో 5600 ఎకరాలు గుంజుకొని గరీబోళ్ల కళ్ళలో మట్టి కొట్టిన నాయకుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు… గరిబోల్లకు ఖరీదైన భూములు ఉండవద్దు అని ప్ర‌శ్నించారు. మన నియోజకవర్గ నుంచి ముఖ్యమంత్రి అయితే మనకు బాగు చేస్తారు అనుకుంటే , మ‌న భూములు గుంజుకొని బిచ్చగాళ్లను చేస్తున్నార‌ని ఈట‌ల ఫైర్ అయ్యారు..

ఇంకా ఏమ‌న్నారంటే..

రేషన్ కార్డులు ఇవ్వలేదు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదు, కానీ బెల్ట్ షాపులు పెట్టి తాగుబోతులు చేస్తున్న వ్యక్తి కేసీఆర్.
బిజెపికి అధికారం ఇస్తే ఒక ఎకరం కూడా దళితుల నుంచి గుంజుకోము. నరేంద్ర మోడీ హకారంతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాము. ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇస్తాము. ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తాం. పది లక్షల రూపాయల ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తాం. ఇన్నాళ్ళు మనల్ని పట్టించుకోని టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వచ్చి మనల్ని ప్రలోభ పెట్టి, ఆశ చూపించి ఓటు వేయించుకునే ప్రయత్నం చేస్తారు. ధర్మం న్యాయం బ్రతకాలంటే బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి. కెసిఆర్ ను ఓడగొట్టాలి. ఏ ఓటు వేసి ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారో..అదే ఓటుతో దెబ్బ కొట్టాలి అంటూ ఈట‌ల పిలుపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement