Friday, May 3, 2024

బోయిన్ పల్లిలో తీవ్ర విషాదం – ఈతకు వెళ్లి నలుగురు మరణం

నారాయణపేట జిల్లా బోయిన్ పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గు చిన్నారులు సహా ఓ మహిళ మృతి చెందారు. చెరువులో మునిగిపోతున్న పిల్లలను కాపాడే ప్రయత్నంలో తల్లి సురేఖ కూడా ప్రాణాలు కోల్పోయింది. వీరు నీటిలో మునిగిపోతుండగా మమత అనే అమ్మాయి చూసి ఊళ్ళో వారికి సమాచారం అందించింది. కానీ గ్రామస్థులు అక్కడికి చేరుకునే లోపే చిన్నారులతో సహా తల్లి ప్రాణాలు కోల్పో యారు.మృతి చెందిన చిన్నారులు విజయ్(11), లిఖిత(10), వెంకటేష్(11)లుగా గుర్తించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement