Sunday, April 28, 2024

TS : వార్థా న‌దిలో న‌లుగురు గ‌ల్లంతు

పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు . కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి వద్ద సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హోలీ ఆడిన అనంతరం నలుగురు యువకులు వార్ధా నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు నదిమాబాద్ కు చెందిన సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. మృతదేహాలను కౌటాల ఆస్పత్రికి తరలించారు. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement