Monday, September 16, 2024

TS: కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్

ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణా పాల్గొన్నారు.

అలాగే మరోవైపు ఇవాళ‌ గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మేయర్ బాటలోనే మరో పది మంది కార్పొరేటర్లున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement