Sunday, April 28, 2024

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కలిశారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిశారు.

దాదాపు ఇరవై నిమిషాల పాటు వారు మాట్లాడుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ఎమ్మెల్సీలు ఇవ్వాల్సి ఉందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ, లోక్ సభ స్థానాలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement