Tuesday, April 30, 2024

TS : కాంగ్రెస్‌లోకి బోథ్ మాజీ ఎమ్మెల్యే…పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్

బోథ్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు తాజాగా సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరి వెనువెంటనే బీజేపీలోకి మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.

- Advertisement -

మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. అలాగే నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement