Wednesday, May 15, 2024

Food Poison – ఎస్ ఆర్ ప్రైమ్ కాలేజ్ లో ఫుడ్ పాయిజన్… 24 మంది విద్యార్ధులు అస్వస్థత

కాజీపేట : వరంగల్ బట్టుపల్లి లోని ఎస్ ఆర్ ప్రైమ్ కాలేజ్ లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. సంబంధిత కళాశాల నిర్వాహకులు ఆదివారం విద్యార్థులకు చికెన్ తో భోజనం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సాయంత్రం సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యాయి. అయితే వారిలో 24 మందిని కళాశాల నిర్వాహకులు కాజీపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది.

విషయం తెలుసుకున్న పేరెంట్స్ హాస్పిటల్ కు వెళ్తే ఆస్పత్రి నిర్వాహకులు వారిని లోపలికి అనుమతించడం లేదని సమాచారం. కాగా, తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement