Friday, May 17, 2024

రైతుల రుణ మాఫీ – తొలి రోజు 44,870 అన్న‌దాత‌ల‌కు రుణ విముక్తి

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. రుణ‌మాపీ చెల్లింపుల‌కు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుద‌ల‌య్యాయి. గురువారం రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మ‌ధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. దీంతో 44,870 మంది రైతులు రుణ విముక్తుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలంగాణ రైతుల త‌ర‌పున ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కాగా, . తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లోనే రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత ప్రభుత్వంలో మొత్తం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు.
ఈసారి సుమారు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది. తొలి రెండు దఫాల్లో మొత్తం 40.74 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.17,351 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. తాజా రుణమాఫీని కూడా కలిపితే ఇది సుమారు రూ.36 వేల కోట్లకు చేరనున్నది. తాజా రుణమాఫీతో సుమారు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement