Friday, May 3, 2024

TS: వేములవాడ జాతరలో అగ్నిప్రమాదం

వేములవాడ, సెప్టెంబర్ 9 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమీపంలోని జాతర గ్రౌండ్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. జాతర గ్రౌండ్‌ ఏరియాలో ఉన్న ఆలయానికి చెందిన రెండు లీజు గదుల్లో నిల్వచేసిన కొబ్బరి చిప్పలకు మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఆరబెట్టిన కొబ్బరి చిప్పలు కావడంతో మంటలు వేగంగా విస్తరించడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, ఆస్తి నష్టం మాత్రం సంభవించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement